రాముడు కలలోకి వచ్చాడు

హిందువుగా మారుతున్నా

లక్నో,నవంబర్‌3(జ‌నంసాక్షి): సాక్షాత్తూ శ్రీరాముడే తనకు చెప్పాడంటూ ఓ ముస్లిం వ్యక్తి హిందూ మతాన్ని స్వీకరించాడు. అతనొక్కడే కాకుండా సదరు వ్యక్తికి చెందిన మొత్తం కుటుంబం కూడా హిందూ మతాన్ని స్వీకరించింది. దీంతో బంధువులు, సన్నిహితులు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని హెచ్చరించారు. అయితే ఇందుకు అంగీకరించని ఆ కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ లో చోటుచేసుకుంది. యూపీలోని షావ్లిూ పట్టణంలో షహజాద్‌ రాణాకు గత 20 రోజుల నుంచి శ్రీరాముడు తనకు కలలో దర్శినమిస్తున్నాడని, ఆయన మతం మార్చుకోవాలని చెప్పడంతో రాణా తన కుటుంబంతో కలిసి హిందూ మతాన్ని స్వీకరించానన్నాడు. తన పేరును కూడా సంజూ రాణాగా మార్చుకున్నారు. బంధువులు, సన్నిహితుల నుంచి బెదిరింపులు తీవ్రం కావడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. తనకు రక్షణ కల్పించాల్సిందిగా న్యాయమూర్తిని కోరారు. మరోవైపు ఈ విషయమై లక్నో ఎస్పీ దినేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు సంజూ రాణాను బెదిరించినట్లు ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని వెల్లడించారు.