రాయగఢ్‌ వద్ద రోడ్డు ప్రమాదం: ఆరుగురి మృతి

విజయనగరం,ఫిబ్రవరి17(జ‌నంసాక్షి): ఒడిశా- విజయనగరం సరిహద్దులోని రాయగఢ్‌ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపేట సవిూపంలో పత్తి లారీ- ఆటో ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు రాయ్‌గఢ్‌ వాసులుగా గుర్తించారు. ప్రమాదంలో మరో నలుగురు గాయపడగా వారిని ఆస్పత్రికి తరలించారు.