రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి నిర్ణయం:సర్వే

న్యూఢిల్లీ, జనంసాక్షి: రాష్ట్రంలో 1,817 కిలోమీటర్ల జాతీయ రహదారుల అభివృద్ధికి నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ తెలిపారు. పార్లమెంట్‌ సభ్యుల సలహాలు తీసుకుని ప్రాంతాల వ్యత్యాసం లేకుండా రహదారుల అభివృద్ధి చేపడుతామని పేర్కొన్నారు. గతంలో పని చేసిన ఉపరితల రవాణాశాఖ మంత్రులు వారి రాష్ట్రాలకే ప్రాధాన్యత ఇచ్చారని సర్వే చెప్పారు.