రాష్ట్రపతికి వీడ్కోలు పలికిన గవర్నర్‌, సీఎం

ixb2avp8హైదరాబాద్‌: రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ హైదరాబాద్‌లో శీతాకాల విడిది ఇవాళ్టితో ముగిసింది. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 14రోజుల విడిది అనంతరం ప్రణబ్‌ముఖర్జీ గురువారం ఉదయం దిల్లీ బయలుదేరారు. హకింపేట విమానాశ్రయంలో రాష్ట్రపతికి… తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ నరసింహన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, సీఎస్‌ రాజీవ్‌శర్మ, డీజీపీ అనురాగ్‌శర్మ, పలువురు రాష్ట్రమంత్రులు మహమూద్‌ అలీ, జగదీశ్‌రెడ్డి తదితరులు ఘనంగా వీడ్కోలు పలికారు.