రాష్ట్రపతిని కలిసిన గీత
పాకిస్థాన్ నుంచి 15 ఏళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన గీత… ఇవాళ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఈదీ పౌండేషన్ సభ్యులతో కలిసి ఆమె రాష్ట్రపతి భవన్ లో ప్రెసిడెంట్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి వారికి సాదర స్వాగతం పలికి కాసేపు మాట్లాడారు. ఇన్నాళ్లు గీతకు ఆశ్రయమిచ్చిన ఈదీ పౌండేషన్ నిర్వాహకులను రాష్ట్రపతి అభినందించారు. గీతను భారత్ కు తీసుకురావటానికి కృషి చేసిన భారత్, పాకిస్థాన్ అధికారులను ఈ సందర్భంగా రాష్ట్రపతి అభినందించారు. ఇప్పటికే గీత ప్రధాని మోడీ, విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ లను కలిశారు.