రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతికి మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు

 హైదరాబాద్‌: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీకి శుభాకాంక్షలు తెలిపారు. ప్రధాని మోదీ స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి.. పుష్పగుచ్ఛం అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోదీ తన ట్విట్టర్‌ ఖాతా ద్వారా వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతితో పలు అంశాలను చర్చించినట్లు ప్రధాని పేర్కొన్నారు.