రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి కన్నుమూత

jwje2q1qన్యూఢిల్లీ, ఆగస్టు 18 : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ సతీమణి సువ్రా ముఖర్జీ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంగా బాధపడుతున్న ఆమె ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. శ్వాసకోవ వ్యాధితో బాధపడుతున్న సువ్రా ముఖర్జీని ఆగస్టు 7 ఆర్మీ ఆస్పత్రిలో చేర్చించారు.
ఈ ఉదయం సువ్రా ముఖర్జీ ఆరోగ్యపరిస్థితి విషమించడంతో 10:51 గంటలకు మరణించారు. సువ్రా మృతిని రాష్ట్రపతిభవన్‌ కార్యాలయ వర్గాలు, ఆర్మీ ఆస్పత్రి వర్గాలు అధికారికంగా ధృవీకరించాయి. సువ్రా మృతి పట్ల ఆయా పార్టీల ప్రముఖులు, నేతలు సంతాపం ప్రకటించారు.