రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం.

– సర్పంచ్ జయ దయాకర్

మర్పల్లి అక్టోబర్ 07 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్ క్రీడలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నరని బూచన్ పల్లి గ్రామ సర్పంచ్ జయ దయాకర్ అన్నారు. శనివారం మండల పరిధిలోని బూచన్ పల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో క్రీడాభిమానులకు కెసిఆర్ స్పోర్ట్స్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడలపై ఆసక్తి చూపాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం కలుగుతుందని వారికి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ మధుకర్, వార్డ్ మెంబర్స్ బి. రవీందర్, టి. రవీందర్, బిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు యాదగిరి, రఫీ, అంజయ్య, ఆకాష్, సాయి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.