రాహుల్‌ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు

2

హైదరాబాద్‌: ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ట్విట్టర్‌ ద్వారాను, ఇంకా పలు రకాలుగా రాహుల్‌ పర్యటన గురించి చెప్పినా..ఉన్నట్టుండి పర్యటనను వాయిదా వేసుకున్నారు. లోక్‌సభ సమావేశాలను పొడిగించడం వల్లే ఆయన పర్యటన వాయిదా పడిందని చెబుతున్నారు.

ఆదిలాబాద్‌ జిల్లా నిర్మల్‌ ప్రాంతంలో ఈనెల 12వ తేదీన రాహుల్‌ పర్యటించాల్సి ఉండగా, 15వ తేదీకి ఆ పర్యటన వాయిదా వేశారు. ఆరోజు నిర్మల్‌లో ఆయన 15 కిలోవిూటర్ల మేర పాదయాత్ర చేస్తారు.