రాహుల్ ని ప్రశ్నించిన కేజ్రీవాల్
ప్రధాని మోదీ వ్యక్తిగతంగా అవినీతికి పాల్పడినట్లు రాహుల్గాంధీ దగ్గర రుజువులు ఉంటే వాటిని ఎందుకని పార్లమెంటు బయట బహిర్గతం చేయడం లేదని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. భాజపా, కాంగ్రెస్ మధ్య స్నేహపూర్వక ఒప్పందం ఉంది. అగస్టా వెస్ట్ల్యాండ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాంగ్రెస్, సహారా/బిర్లా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న భాజపా, ఒకరి తప్పులు మరొకరు కప్పిపుచ్చుకుంటున్నారని వరుస ట్వీట్ల ద్వారా విమర్శించారు. నోట్ల రద్దుపై వ్యాపారులు భాజపాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని తెలిపారు. భాజపా తమ వద్ద నుంచి డబ్బులు తీసుకుందని, తాము వేసిన ఓట్ల ద్వారా గెలుపొంది, తమనే దొంగలని అంటోందని వ్యాపారులు భాజపాపై తీవ్ర ఆగ్రహంగా ఉన్నారని కేజ్రీవాల్ మరో ట్వీట్ చేశారు.