రాహుల్ ను ఎవరు పట్టించుకోరు
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ వ్యాఖ్యలను దేశంలో ఎవరూ పరిగణనలోకి తీసుకోరని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్సింగ్ చౌహాన్ పేర్కొన్నారు. మీడియాతో శివరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ప్రధాని ఆలోచనంతా దేశ ప్రయోజనాల కోసమేనని కొనియాడారు. పెద్ద నోట్ల రద్దు అంశంపై ప్రధాని నిర్ణయాన్ని దేశమంతా స్వాగతించిందని తెలిపారు. అవినీతి నిర్మూలన, ఉగ్రవాదంపై పోరు కోసమే పెద్ద నోట్ల రద్దు చేసినట్లు పేర్కొన్నారు. క్రమంగా నగదు రహిత సమాజం వైపు అడుగులు వేస్తున్నామన్నారు. కొత్తనోట్లు చలామణిలోకి వచ్చాయని, పరిస్థితి సాధారణ స్థితికి రానుందని తెలిపారు.