రిలయన్స్ జియోకు ఫైన్
వెల్కమ్ ఆఫర్ను మార్చి 31, 2017వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించి కస్టమర్ల మన్ననలు పొందిన రిలయన్స్ జియో చిక్కుల్లో ఇరుక్కుంది. జియోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జాతీయ పత్రికల్లో యాడ్ ఇవ్వాలని జియో భావించింది. అయితే ఆ యాడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోను ఉపయోగించారు. ఆ యాడ్కు సంబంధించిన ఫోటో బయటికొచ్చింది. ప్రధాని ఫోటోను వినియోగించేందుకు ఎలాంటి అనుమతినివ్వలేదని ఇప్పటికే అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ అడ్వర్టైజ్మెంట్స్ అనుమతి లేకుండా ఈ ఫోటోను ముద్రించినందుకు జియో యాజమాన్యానికి జరిమానా విధించారు. ఆ జరిమానా 5వందల రూపాయలు. ఇలా ప్రధాని ఫోటోను ఉపయోగించుకోవడం చట్ట ఉల్లంఘన కిందకు వస్తుందని, విచారించి తగిన చర్యలు తీసుకుంటామని సదరు మంత్రిత్వ శాఖ తెలిపింది.