రుణాల మాఫీ కుంభకోణంపై లోక్సభలో ఆందోళన
న్యూఢిల్లీ : వ్యవసాయ రుణాల మాఫీలో కుంభకోణం అంశం లోక్సభను కుదివేసింది. ఈ ఉదయం సమావేశాలు ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు ఈ వ్యవహారంపై ఆందోళనకు దిగారు. ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సభ్యులు శాంతించకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.