రూ.200లకే బిడ్డను అమ్మిన తల్లి

200 రూపాయలకే బిడ్డను అమ్ముకుంది ఓ తల్లి. సంతలో సరుకులా.. ఎంతకు వస్తే అంత అన్నట్టు కన్నపేగు బంధాన్ని తెంచుకుంది. ఈ ఘటన త్రిపురలోని గందచరలో చోటుచేసుకుంది. ఓ ఆటో డ్రైవర్ బిడ్డను కొనుకున్నాడు. ఈ విషయాన్ని గ్రామ పెద్దల దగ్గరకు తీసుకెళ్లాడు బిడ్డ తండ్రి ఖనజోయ్ రేంగ్. తను వద్దని మొత్తుకుంటున్నా.. బిడ్డను అమ్మేసిందని పెద్దల దగ్గర మొరపెట్టుకున్నాడు.  దీంతో ఆ బిడ్డను తిరిగి తల్లి వద్దకు చేర్చేందుకు రెడీ అయ్యారు పెద్దలు. బిడ్డ కొనుగోలు వ్యవహారం పెద్దది కావడంతో కొనుక్కున్న వాళ్లు కూడా బిడ్డను తల్లికి అప్పగించేందుకు సిద్ధమని తెలిపారు. అయితే బిడ్డను అమ్ముకోవడానికి గల కారణాలు తెలియడం రాలేదు.

గతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. 11 రోజుల బిడ్డను రూ.5000లకు అమ్మేసుకుంది తల్లి. భర్త వైద్య ఖర్చుల కోసమే ఆ తల్లి బిడ్డను అమ్ముకున్నట్టు తెలిసింది. గత రెండేళ్లలో త్రిపుర గిరిజన ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు తరుచూ చోటుచేసుకుంటున్నాయని తెలిపారు సోషల్ వెల్ఫేర్ అధికారులు.