రూ.4500 నుంచి రూ.2000 తగ్గింపు

shakti-kanth-dasబ్యాంకుల్లో నగదు ఉపసంహరణ పరిమితిని రూ.4500 నుంచి రూ.2000 తగ్గిస్తున్నట్లు ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి శక్తికాంతదాస్‌ తెలిపారు. మీడియాతో శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ.. ఈ ఉపసంహరణ పరిమితి తగ్గింపు రేపటి నుంచి అమలు చేయనున్నామని వెల్లడించారు. రైతులు వారంలో రూ.25 వేల వరకు ఉపసంహరించుకోవచ్చునని అన్నారు.  నగదు కొరతపై మీడియాతో శక్తికాంతదాస్‌ మాట్లాడుతూ.. ఆయా సీజన్లలో రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. గుత్త వ్యాపారులు వారంలో రూ.50 వేలు ఉపసంహరించుకోవచ్చునన్నారు.