రూ.5,44,571 కోట్లు డిపాజిట్
బ్యాంకుల్లో డిపాజిట్లు, నగదు మార్పిడిపై ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. ఈ నెల 10 నుంచి 18 వరకు రూ.5,44,571 కోట్లు డిపాజిట్ అయ్యాయని, ఇందులో రూ.5,11,565 కోట్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేయగా, మరో రూ.33,006 కోట్లు నగదు మార్పిడి జరిగిందని తెలిపారు. ఏటీఎంలు, బ్యాంకుల నుంచి రూ.1,03,316 కోట్లు విత్ డ్రా జరిగిందన్నారు.