రూ.9వేల కోట్ల బ్లాక్మనీ గుట్టురట్టు
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశంలో దాగి ఉన్న నల్లడబ్బుపై కొరడా ఝుళిపిస్తోంది ఇన్కంటాక్స్ డిపార్ట్మెంట్. ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా 60వేల మంది దగ్గర ఇంకా బ్లాక్ మనీ ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ గుర్తించింది. వారి దగ్గర లెక్క తేలని డబ్బు రూ.9,334 కోట్లు ఉన్నట్లు ఐటీ శాఖ తెలిపింది. బ్లాక్మనీ ఉన్నవారందరికీ నోటీసులు పంపినట్లు తెలిపింది ఐటీ శాఖ.
జనవరి 31 ఆపరేషన్ క్లీన్ మనీలో భాగంగా దేశవ్యాప్తంగా 17.92 లక్షల మంది ఆన్లైన్లో నోటీసులు పంపామని ఇందులో 9.46 లక్షల మంది ఆయా ఇన్కమ్ టాక్స్ ఆఫీసులకొచ్చి వివరణ ఇచ్చారని సీబీడీటీ తెలిపింది.