రేపటి బంద్ను తిరస్కరించండి
నల్లధనం వెలికి తీస్తుంటే తట్టుకోలేక ఆక్రోశమా అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరిస్తున్న అభినవ సంస్కర్త ప్రధాని మోడీ అని కొనియాడారు. మోడీకి పెరుగుతున్న జనాదరణను జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. నల్లధనం వెలికితీసే ధర్మయుద్ధాన్ని ఆపడానికి బంద్కు పిలుపునిచ్చారా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలను తగ్గించేందుకు అన్ని చర్యలు చేపడుతున్నామని తెలిపారు. నవంబర్ 8న తీసుకున్నది ఆకస్మిక నిర్ణయం కాదని పేర్కొన్నారు. రేపటి బంద్ను తిరస్కరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.