రేపు వినాయక శోభాయాత్ర

  • మక్తల్ ఆగస్టు 30 (జనంసాక్షి) మక్తల్ పట్టణంలోని శ్రీ పడమటి ఆంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో గల సీతారామ కళ్యాణ మండపము నుండి రేపు వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని విశ్వహిందూ పరిషత్ ,బజరంగదళ్ ఆధ్వర్యంలో వినాయక శోభాయాత్ర కార్యక్రమము ఉదయము 9:30 గంటల నుండి ప్రారంభమగును. ఇట్టి శోభాయాత్ర ఆజాద్ నగర్ మీదుగా విశ్వకర్మ వారి ఇంటి దగ్గరకు చేరుకొని అక్కడ స్వామి వారి చిన్న విగ్రహాలకు పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని అనంతరము వివిధ మండపాలకు వెళ్లి విగ్రహాలను ప్రతిష్టించుకొని వినాయక చవితి ఉత్సవాలు ప్రారంభించుకోవాలి . కావున అందరూ ఇట్టి వినాయక శోభాయాత్ర కార్యక్రమంలో పట్టణంలో ఉన్న వివిధ వినాయక ఉత్సవ కమిటీల సభ్యులు, పట్టణ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ అత్యధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము