రేవంత్‌ రెడ్డి కంటే కేసీఆరే మంచోడు: ` జేపీ ఎంపీ అర్వింద్‌


జగిత్యాల(జనంసాక్షి): రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం కొనసాగుతున్నది. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ నేతలు ప్రచారంలో బిజీగా ఉన్నారు. అయితే, ఈ ఎన్నికల్లో బీజేపీ బరిలో ఉన్నప్పటికీ ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల మధ్యనే పోటీ నెలకొని ఉన్నది. ఇటీవల వెల్లడైన వివిధ సర్వే రిపోర్టులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అన్ని సర్వేలు బీఆర్‌ఎస్‌ పార్టీదే గెలుపని, బీజేపీ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమని వెల్లడిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ కాబోతున్నదని తెలుపుతున్నాయి.ఈ నేపథ్యంలో బీజేపీ తరఫున కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎంపీ అర్వింద్‌ అసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆరే మంచోడని వ్యాఖ్యానించారు. ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే అర్వింద్‌.. రేవంత్‌ రెడ్డి కంటే సీఎం కేసీఆర్‌ మంచోడని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం బీజేపీ ఎలాగూ గట్టి పోటీని ఇచ్చే పరిస్థితిలో లేదు కాబట్టి.. ఎంపీ అర్వింద్‌ తాజాగా అలాంటి వ్యాఖ్య చేసి ఉంటాడనేది వినికిడి.