రైల్వే ఉద్యోగులకు తీపి వార్త

0ex8b0ywరైల్వే ఉద్యోగులకు తీపి వార్తను అందించేందుకు ఆ శాఖ రంగం సిద్ధం చేసింది. ప్రస్తుత ఆర్థిక ఇబ్బందులను పట్టించుకోకుండా 2014-15 సంవత్సరానికి 78 రోజుల వేతనాన్ని ఉత్పాదకత ఆధారిత బోనస్‌గా ఇవ్వాలని కేంద్రానికి రైల్వేశాఖ ప్రతిపాదనను పంపింది. రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్‌ను ఇవ్వాలనే ప్రతిపాదనపై కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకోనున్నది. రైల్వేశాఖ ప్రతిపాదనకు క్యాబినెట్ సానుకూలంగా స్పందిస్తే 12 లక్షల ఉద్యోగులకు లబ్ధి చేకూరనున్నది. ఈ నెలలోనే జీతంతోపాటు సుమారు రూ.8897 బోనస్ పొందే అవకాశముంది. బోనస్ ప్రకటించడం ద్వారా రైల్వేశాఖపై రూ.800 కోట్ల అదనపు భారం పడనున్నది. 2011-12, 2012-13, 2013-14 ఆర్థిక సంవత్సరాలకు 78 రోజుల బోనస్‌ను ప్రకటించింది.