రైస్ మిల్లు డ్రైవర్,కార్మికుల వేతన ఒప్పందం

మిర్యాలగూడ, జనం సాక్షి.
మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ పరిధిలోగల రైస్ మిల్లుల డ్రైవర్లు, కార్మికులకు సంబంధించిన ఖరారు విషయంలో సిఐటియు కార్మిక సంఘం తరపున మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాసు సమక్షంలో శుక్రవారం మిల్లర్స్ సమావేశ మందిరంలో జరిగిన సంయుక్త సమావేశంలో నూతన వేతనాలను ఖరారు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న ధరలు, అవసరాలను దృష్టిలో పెట్టుకొని వేతనాల సవరణలు చేపట్టాలని కోరారు, మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ మిల్లు డ్రైవర్లు, కార్మికులకు సంబంధించిన వేతన సవరణ అందరికీ ఆమోదయోగ్యం లా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఒప్పంద పత్రము లను సిఐటియు రాష్ట్ర నాయకులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డికి అసోసియేషన్ అధ్యక్షులు గౌడ్ శ్రీనివాస్ అందజేశారు.సమావేశంలో ఉపాధ్యక్షులు గుడిపాటి శ్రీనివాస్. కార్యదర్శులు వెంకటరమణ, రంగయ్య, కోశాధికారి పైడిమర్రి సురేష్, రాష్ట్ర మిల్లర్స్ ఉపాధ్యక్షులు కర్నాటి రమేష్, డ్రైవర్ యూనియన్ ప్రతినిధులు టి. రామ్మూర్తి. డబ్బికార్ మల్లేష్, పట్టేం శ్రీనివాసరావు, ఎండి. హైమద్ పాషా, పాశం రవీందర్ రెడ్డి, ముక్కెర అంజి బాబు యాదవ్,తదితరులు పాల్గొన్నారు.