రోడ్డుప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మృతి

రాయ్‌పూర్‌,అక్టోబర్‌31(జ‌నంసాక్షి): రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులతో పాటు బస్సు కండెక్టర్‌ మృతిచెందారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని అటల్‌ నగర్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న సెంట్రల్‌ స్కూల్‌ బస్సు.. సిటీ బస్సు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో సంఘటనా

స్థలంలోనే విద్యార్థి(11), బస్సు కండెక్టర్‌ మృతిచెందారు. మరో విద్యార్థి తీవ్రగాయాలపాలై పరిస్థితి విషమించడంతో మృతిచెందాడు.

కారును ఢీకొన్న బస్సు: పలువురికి గాయాలు

పరిమితికి మించి ప్రయాణికులను తీసుకెళ్తున్న బస్సు కారును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో 26 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. గోవా మార్గావ్‌ పట్టణంలోని మిలటరీ క్యాంప్‌కు సవిూపంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.