రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

ఖమ్మం: దుమ్ముగూడెం మండలం తురుబాక వంతెనపై ఈ తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్రవాహనాన్ని గుర్తుతెలియని వాహనం ఢికొన్న ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.