రోడ్డు ప్రమాదంలో జర్నలిస్ట్ మృతి

మహారాష్ట్రలో ఓ రోడ్డు ప్రమాదం.. జర్నలిస్టును బలి తీసుకుంది. కుర్లాలో ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఢీ కొనడంతో.. విలేకరి ప్రశాంత్ త్రిపాఠి చనిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఒకరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అతి వేగమే ప్రమాదానికి కారణంగా భావిస్తున్నారు.