రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి

తమిళనాడు: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న వ్యాన్‌ను లారీ ఢీకొనడంతో జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నారు. తుతుకుడి జిల్లా ఎట్టపురం దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. గాయపడిన పలువురిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.