రోడ్డు ప్రమాదం: పెళ్లికెళ్లివస్తూ ఐదుగురి మృతి

కలబుర్గి: పెళ్లికి వెళ్లి తిరిగొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. ఈ ఘటన కర్ణాటకలోని కలబుర్గి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ కుటుంబం ఆదివారం అర్ధరాత్రి పెళ్లికి హాజరై తిరిగి ఇంటికి వెళుతుండగా ఎదురుగా వస్తున్న లారీ వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందగా మరో 14 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్ని స్థానికప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. డ్రైవర్‌ మరో వాహనాన్ని ఓవర్‌టేక్‌ చేయబోగా ఎదురుగా వస్తున్న లారీ ఈ వాహనాన్ని ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.