లక్నోలో పేలుడు, ముగ్గురు మృతి

లక్నో, సెప్టంబర్ 13: మధ్యప్రదేశ్ ఝబువా పేలుళ్లలో 90 మంది చనిపోయి 24 గంటల్లోనే మరో పేలుడు జరిగింది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో సమీపంలోని పారా గ్రామంలో సిలెండర్ పేలుడు జరిగింది. ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.