లక్షకోట్లు పెట్టి రాజధాని నిర్మాణం అసాధ్యం

అమరావతిలో ఉన్న వారంతా రియల్‌ వ్యాపారులే
టిడిపి ఎజెండాను మోస్తున్న విూడియా సంస్థలు
టిడిపికి ప్రజలు ఓటుతో బుద్దిచెప్పినా మారడం లేదు
మండిపడ్డ అధికార ప్రతినిధి సజ్జల
అమరావతి,మార్చి4(జనం సాక్షి ): లక్షకోట్లతో రాజధానిని నిర్మించడం ఏప్రభుత్వానికి కూడా సాధ్యం కాదని
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. విూడియా పేరుతో కొందరు టీడీపీ అజెండాను మోస్తున్నారని.. ప్రజల మైండ్‌ను విషపూరితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన విూడియా సమావేశంలో మాట్లాడుతూ, అమరావతి పేరుతో అరచేతిలో స్వర్గం చూపించారని అన్నారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టమూ మోయలేదన్నారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నాం. సొంత ప్రయోజనాల కోసమే టీడీపీ డ్రామాలాడుతుందని సజ్జల దుయ్యబట్టారు. చంద్రబాబు ముఠా నిన్న వికారపు చేష్టలు చేశారు. మాది రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ కాదు. రాష్ట్రం మొత్తం మాకు సమానమే. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం. న్యాయవ్యవస్థను మేం గౌరవిస్తాం. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదు. టీడీపీ వర్గమే నిన్న టపాకాయలు కాల్చి హంగామా చేసిందని సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. గత ప్రభుత్వం తరహాలో తమది రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కాదు అని.. రాష్ట్రం మొత్తం తమకు సమానమే అని సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష మేరకు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే న్యాయవ్యవస్థను తాము గౌరవిస్తామన్నారు. అమరావతిలో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులే ఎక్కువగా ఉన్నారని, నిజమైన రైతులు తక్కువగా ఉన్నారన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ నిర్మించి టీడీపీ ప్రభుత్వం రోడ్లు కూడా వేయలేదన్నారు. అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు తామే న్యాయం చేస్తున్నామని సజ్జల తెలిపారు. ప్రజలు ఎన్నిసార్లు ఓటుతో బుద్ధి చెప్పినా టీడీపీ మారడం లేదని మండిపడ్డారు. హైకోర్టు తీర్పు తర్వాత టీడీపీ వర్గమే టపాకాయలు కాల్చి హంగామా చేసిందని ఎద్దేవా చేశారు. ఏపీ రాజధాని అమరావతిపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. అమరావతి పేరుతో గత ప్రభుత్వం టీడీపీ అరచేతిలో స్వర్గం చూపించిందని ఆయన ఆరోపించారు. అమరావతిలో టీడీపీ నేతలు ఇన్‌సైడ్‌ ట్రేడిరగ్‌ చేసుకున్నారని విమర్శలు చేశారు. రైతు ఉద్యమం పేరుతో చంద్రబాబు గ్యాంగ్‌ దుష్పచ్రారం చేస్తోందని మండిపడ్డారు. రాజధాని పేరుతో లక్ష కోట్ల భారాన్ని ఏ రాష్టం కూడా మోయలేదన్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్లు ఖర్చుపెట్టడం
అసాధ్యమని అభిప్రాయపడ్డారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసమే తమ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయం తీసుకుందని గుర్తుచేశారు.