లాభాలతో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

1

ముంబయి: స్టాక్‌మార్కెట్లు మంగళవారం లాభాలతో ప్రారంభమయ్యాయి. నేడు ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష జరగనుంది. దీని ప్రభావం స్టాక్‌మార్కెట్లపై పడింది. నిన్న 45పాయింట్ల నష్టంతో 24,825 వద్ద ముగిసిన సెన్సెక్స్‌.. నేడు ఉదయం 64.43 పాయింట్లు లాభపడింది. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ సైతం 12.25పాయింట్లు లాభపడి 7,568.20 వద్ద కొనసాగుతోంది.