లాభాల్లో స్టాక్ మార్కెట్లు
ముంబయి: స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్, 25 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఎస్బీఐ, టాటా మోటార్స్ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 67.20 పైసలుగా ఉంది.