లారీని ఓవర్‌టేక్‌ చేస్తుండగా ప్రమాదం

లారీని ఢీకొన్న బస్సు: క్లీనర్‌ మృతి
విజయవాడ,మార్చి9(జనం సాక్షి): లారీని ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురయ్యింది.
కృష్ణా జిల్లా కంచికచెర్ల మండలం పరిటాల బైపాస్‌లో లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటన తీవ్ర కలకలం రేపింది. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళుతున్న లారీని ఓవర్‌ టేక్‌ చేస్తుండగా.. ఢీకొట్టింది. బస్సులో క్లీనర్‌ మృతి చెందాడు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. శంషాబాద్‌ నుంచి స్లీపర్‌ ఆర్టీసీ బస్సు విజయవాడకు వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇదిలావుంటే గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని ఆసుపత్రి సవిూపంలో జాతీయ రహదారిపై ఎక్సెల్‌ బండిని కారు ఢీకొట్టింది. గన్నవరం రాజీవ్‌ కాలనీ చెందిన నాగేశ్వరరావు అనే వ్యక్తి తీవ్ర గాయాలు అయ్యాయి. మహిళ డ్రైవింగ్‌ చేస్తూ నాగేశ్వరరావును ఢీకొట్టి కారుతో అక్కడి నుంచి పరారైంది.