లారీని ఢీకొన్న బస్సు`నలుగురి మృతి

నల్గొండ, నకిరేకల్‌ : హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వెళుతున్న ఆర్టీసీ బస్సు అగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టిన సంఘటన నకిరేకల్‌ పట్టణ శివారులో బుధవారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో భద్రాచలం బస్‌ కండక్టర్‌ ఇ సత్యానారాయణ(52), వరంగల్‌ జిల్లా మర్రిపేట భంగ్లాకు చెందినదుర్గా అఖిల్‌ (17), మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన జి. మద్దిలేటి (30) గా గుర్తించారు. మృతుల్లో నాలుగో వ్యక్తికి సంబంధించి విషయాలు తెలియాల్సి ఉంది.