లారీలు ఢీకొని గొర్రెలు మృతి

చిత్తూరు,జూలై22(జ‌నంసాక్షి): మూడు లారీలు ఢీకొనడంతో బోల్తాపడిన లారీ కిందపడి కొన్ని గొర్రెలు మృతి చెందాయి. ఈ విషాద ఘటన సోమవారం పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. పీలేరు – చిత్తూరు జాతీయ రహదారిపై మూడు లారీలు ఢీకొనడంతో ఓ లారీ బోల్తాపడింది. బోల్తాపడిన లారీ కింద కొన్ని గొర్రెలు మృతి చెందాయి. 22 గొర్రెలు కనపడటం లేదని గొర్రెల కాపరులు చెబుతున్నారు. గొర్రెలను పోగొట్టుకున్న బాధితులు.. పీలేరు సవిూపంలోని గోరంటపల్లి పంచాయితీ, బెస్తపల్లెకు చెందిన సుధాకర్‌, రమణ, లక్ష్మన్న లు తమ జీవనోపాధిని కోల్పోయామంటూ వాపోయారు.