లాలూని కలుసుకున్న రాహుల్‌

న్యూఢిల్లీ, జ‌నం సాక్షి ) : కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సోమవారం ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను పరామర్శించారు. సోమవారం ఉదయం ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి వెళ్లిన ఆయన… కొద్దిసేపు అక్కడే ఉండి లాలూ ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. దాణా కుంభకోణం కేసుల్లో దోషిగా తేలిన లాలూ.. గతేడాది డిసెంబర్‌ 23నుంచి లాలూ రాంచీ జైలులో శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆరోగ్యం క్షీణించడంతో గత నెల 29న ఢిల్లీలోని ఎయిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. గుండె, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న లాలూ… ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు వైద్యులు చెబుతున్నారు. లాలూ చికిత్స కోసం ఎయిమ్స్‌ యాజమాన్యం ఆరుగురు డాక్టర్లతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది.