లావాదేవాలపై కన్ను

న్యూఢిల్లీ,జనవరి9(జ‌నంసాక్షి ): పెద్దనోట్ల రద్దు తరవాత ఇప్పుడు పాన్‌ నంబర్‌ ప్రతి బ్యాంక్‌  ఖాతాకు తప్పనిసరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో  బ్యాంకుల్లో ఖాతాలన్నీ ఒకే పద్దు కిందకు వస్తాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. వివిధ రకాల లావాదేవీలను దీంతో అరికట్టడం వీలవుతుంది.పాన్‌తో అనుసంధానం కావాలని బ్యాంకులకు సూచిస్తూ ఆదాయ పన్ను నిబంధనలను సవరించామని పేర్కొంటూ కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  ఉత్తర్వులు జారీ చేసింది.