లోక్సభ వాయిదా
దిల్లీ: పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలు ఈరోజు ప్రారంభమయ్యాయి. లోక్సభ ప్రారంభమైన వెంటనే దివంగత సభ్యుడు ఇ.అహ్మద్ మృతిపై చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుబట్టాయి. దీనికి స్పీకర్ సుమిత్రా మహాజన్ అంగీకరించకపోవడంతో విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు.