లోక్ సభ వాయిదా
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. లోక్సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ అధ్యక్ష స్థానంలో ఉన్నారు. మృతి చెందిన పార్లమెంటు మాజీ సభ్యులకు లోక్సభ నివాళులర్పించింది. సభ ప్రారంభం కాగానే సభ్యలంతా ఒక నిముషం పాటు మౌనం పాటించారు.ఇటీవల మరణించిన పార్లమెంట్ సభ్యులు, థాయ్ లాండ్ రాజు, ఇజ్రాయిల్ మాజీ అధ్యక్షులకు సంతాపం తెలుపుతూ తిర్మానాన్ని ఆమోదించారు కాగా లోక్ సభ రేపటికి వాయిదా పడింది.