లోయలోపడిన బస్సు: ఇద్దరి మృతి

 హైదరాబాద్‌: ప్రయాణికులతో వెళుతున్న బస్సు లోయలో పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం చమోలి జిల్లాలో మంగళవారం ఉదయం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… ఓ ప్రైవేటు ట్రావెల్స్‌కి చెందిన బస్సు ప్రయాణికులతో కురుద్‌ నుంచి గోపేశ్వర్‌కి వెళుతోంది. ఆ సమయంలో బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతిచెందగా.. మరో 15మందికి గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటనా స్థలికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.