న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఆధార్ కార్డుల జారీ త్వరలో వందకోట్ల మార్క్ దాటనుంది. సామాజిక పథకాల ప్రయోజనాలు నేరుగా లబ్ధిదారులకే అందేలా చూడాలని భావిస్తున్న కేంద్ర సర్కారుకు ఇది మరింత ఉత్తేజాన్ని ఇవ్వనుంది. ఇప్పటివరకు 99.91 కోట్ల మందికి కార్డులను జారీ చేశామని ఆధార్ ప్రాజెక్టును అమలు చేస్తున్న విశిష్ఠ గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) తన వెబ్సైట్లో పేర్కొంది. వందకోట్ల మందికి ఆధార్ కార్డుల జారీపై టెలికం మంత్రి రవిశంకర్ ప్రసాద్ సోమవారం అధికారికంగా ఓ ప్రకటన చేస్తారు.