వంద రోజల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం

` సర్వమతాలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో హామీ పత్రం
` తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమే..
` రాష్ట్రాన్ని సర్వం దోచుకున్న కేసీఆర్‌ కుటుంబం
` ముఖ్యమంత్రికి ఓటమి భయం పట్టుకుంది
` ఆయనలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది
` కేసీఆర్‌ ఇక ఫాంహౌజ్‌కే పరిమితం
` తెలంగాణలో పోటీలోనేలేని భాజపా
` కాంగ్రెస్‌ మేనిఫెస్టోను విడుదల చేసిన మల్లికార్జున ఖర్గే
హైదరాబాద్‌(జనంసాక్షి):తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్‌ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే  స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ కాంగ్రెస్‌ మేనిఫెస్టోను ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే  విడుదల చేశారు. మొత్తం 36 అంశాలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టో విడుదలైంది. దాదాపు 42 పేజీలతో కాంగ్రెస్‌ మేనిఫెస్టోను రిలీజ్‌ చేసింది. అలాగే జాబ్‌ క్యాలెండర్‌ను  కూడా హస్తం పార్టీ విడుదల చేసింది. గ్రూప్‌ `1 ఉద్యోగాల భర్తీ డేట్‌ను కూడా ప్రకటించింది. ఫిబ్రబర్‌ 1, 2024లో ఉద్యోగాలు భర్తీ చేస్తామని కాంగ్రెస్‌ ప్రకటించింది. తమ మేనిఫెస్టో తెలంగాణ ప్రజలకు అంకితమని ఖర్గే స్పష్టం చేశారు. సర్వమతాలకు కాంగ్రెస్‌ మేనిఫెస్టో హావిూ పత్రమని.. హిందువులకు భగవత్‌ గీత , ముస్లింలకు ఖురాన్‌, క్రిస్టియన్‌లకు బైబిల్‌ తమ మేనిఫెస్టో అని ఏఐసీసీ చీఫ్‌ వెల్లడిరచారు. ఈసారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌ సర్కార్‌ అవినీతికి పాల్పడిరదని ఆరోపించారు. కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుందని.. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నదని ఆయన తెలిపారు. మోదీ, కేసీఆర్‌ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని.. జనాలు ఇప్పటికే డిసైడ్‌ అయిపోయారని చెప్పుకొచ్చారు. ఎప్పుడూ ఫార్మ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్‌ ఇక.. అక్కడే ఉండిపోతారని.. జనాలు బై బై కేసీఆర్‌.. టాటా కేసీఆర్‌ అంటారని అన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారని తెలిపారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే.. జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టులు, పథకాలు, ప్రతి దాంట్లోనూ అవినీతికి పాల్పడు తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో ఐదు గ్యారెంటీలను ఇచ్చినట్టే.. ఇక్కడా ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు. కర్ణాటకలో చెప్పిన ప్రతి హావిూనీ తాము నెరవేరుస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఆరు గ్యారెంటీలను బరాబర్‌ అమలు చేసి తీరుతామని.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక కేబినెట్‌ ఏర్పాటైన తొలి రోజే వాటిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ‘‘మా తొలి లక్ష్యం.. మహాలక్ష్మి పథకం.. ప్రతి నెలా రూ.2500, రూ.500కే గ్యాస్‌, బస్సుల్లో ఫ్రీ జర్నీ’’ అని మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు.
కేసీఆర్‌ ఇక ఫాంహౌజ్‌కే పరిమతం
హైదరాబాద్‌: తెలంగాణ ప్రజల బాగు కోసమే కాంగ్రెస్‌ మేనిఫెస్టో అని, ఈ సారి రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ధీమా వ్యక్తం చేశారు.శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో కేసీఆర్‌ సర్కార్‌ అవినీతికి పాల్పడిరదని మండిపడ్డారు.’’కొద్ది రోజులుగా కేసీఆర్‌కు భయం పట్టుకుంది. ఆయన గొంతులో ఆందోళన కనిపిస్తున్నది. మోదీ, కేసీఆర్‌ కలిసి ఎన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయం జనాలు ఇప్పటికే డిసైడ్‌ అయిపోయారు. ఎప్పుడూ ఫామ్‌ హౌస్‌లోనే ఉండే కేసీఆర్‌ ఇక అక్కడే ఉండిపోతారు. జనాలు బై బై కేసీఆర్‌ టాటా కేసీఆర్‌ అంటారు. విద్యార్థులు, ఉద్యోగుల బలిదానాలు చూసి సోనియా తెలంగాణ ఇచ్చారు. జనాలు బాగు పడతారని తెలంగాణ ఇస్తే జనాలను దోచుకునే వాళ్లు రాజ్యమేలుతున్నారు’’ అంటూ ఖర్గే మండిపడ్డారు.ప్రాజెక్టులు, పథకాలు ప్రతి దాంట్లోనూ అవినీతి. తెలంగాణలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక తొలిరోజే వాటిపై నిర్ణయం తీసుకుంటాం’ అని ఖర్గే పేర్కొన్నారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టో ఇదే..
నిరుద్యోగ నిర్మూలన , ఉద్యోగం కల్పించే వరకు రూ.4 వేల నిరుద్యోగ భృతి,మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ,మొదటి ఏడాదిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ బ్యాక్‌ లాగ్‌ పోస్టుల భర్తీ,18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతీ యువతికి ఎలక్ట్రిక్‌ స్కూటర్లు,ఎస్సీ రిజర్వేషన్ల పెంపు,ఏబీసీడీ వర్గీకరణ,బెల్ట్‌ షాపులు రద్దు,తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఎంటి స్థలం, గౌరవ భృతి,వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌,3 లక్షల వడ్డీ లేని పంట రుణం, కోతుల నివారణకు ప్రతీ జిల్లాలో స్టెరిలైజ్‌ కేంద్రం,కాళేశ్వరం అవినీతిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ,చెరువుల నిర్వాహణ, మరమ్మతుల బాధ్యత నీటి సంఘాలకు అప్పగింత,తొలి క్యాబినెట్‌లో మెగా డీఏస్సీ,రూరల్‌ యూత్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌కు రూ.1000 కోట్ల బడ్జెట్‌,విద్యార్థులకు ఫ్రీ ఇంటర్‌ నెట్‌,విద్యా రంగానికి బడ్జెట్‌లో 6 నుంచి 15 శాతం వరకు పెంపు,ఖమ్మం, ఆదిలాబాద్‌లలో నూతన విశ్వవిద్యాలయాలు,వైద్య రంగం బడ్జెట్‌ రెట్టింపు,ధరణి స్థానంలో భూమాత పోర్టల్‌,రేషన్‌ ద్వారా సన్న బియ్యం , రేషన్‌ డీలర్‌లకు రూ.5 వేల గౌరవ భృతి,కొత్త రేషన్‌ కార్డులు,200 యూనిట్ల లోపు ఉచిత కరెంటు,ఆర్టీసీని ప్రభుత్వంలో వీలీన పక్రియ పూర్తి చేస్తాం,ప్రతీ ఆటో డ్రైవర్‌కు సంవత్సరానికి రూ.12 వేల ఆర్థిక సహాయం,కళ్యాణమస్తు కింద లక్ష రూపాయలతో పాటు 10 గ్రాముల బంగారం,మహిళా సంఘాలకు పావులా వడ్డీ రుణాలు,జూనియర్‌ న్యాయవాదులకు మొదటి 5 సంవత్సరాలు నెలకు రూ.5 వేల గౌరవ భృతి,100 కోట్లతో జర్నలిస్ట్‌ల సంక్షేమ నిధి,హైదరాబాద్‌తో పాటు ఇతర జిల్లాల్లో జర్నలిస్టుల ఇళ్ళ సమస్యకు పరిష్కారం.
ఎన్నారైల సంక్షేమ బోర్డ్‌,దివ్యాంగులకు రూ.6 వేల పెన్షన్‌,దేవాలయాలకు దూప దీప నైవేద్యం కింద నెలకు రూ.12 వేలు
తెలంగాణలో పోటీలోనే లేని భాజపా
కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ ప్రజల కోసమే పోరాటం చేస్తోందని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. విజయభేరి సభలో ఖర్గే మాట్లాడుతూ.. ‘‘భాజపా, భారాసతో కాంగ్రెస్‌ పోరాటం చేస్తోంది. తెలంగాణలో భాజపా పోటీలో లేకుండా పోయింది. ఎక్కడా కనిపించడం లేదు. భాజపా, భారాస కలిసే తెలంగాణలో పోటీ చేస్తున్నాయి. వాటి మధ్య రహస్య ఒప్పందం ఉంది. కాంగ్రెస్‌ను ఓడిరచేందుకు ఆ రెండు పార్టీలు శ్రమిస్తున్నాయి. అవి ఎంత ప్రయత్నించినా భయపడేది లేదు. ప్రజలందరి పోరాటం చూసి సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ఒక్క కుటుంబం కోసం కాదు’’ అని ఖర్గే అన్నారు.