వచ్చే ఎన్నికల్లో పోటీచేయను: సిద్దరామయ్య

బెంగుళూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని కర్నాటక మాజీ సిఎం కాంగ్రెస్‌ నేత సిద్ధరామయ్య తేల్చి చెప్పారు. బాగల్‌కోట జిల్లా బాదామి తాలూకా గుళేదగుడ్డ పట్టణంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సిద్ధరామయ్య మాట్లాడుతూ.. అభివృద్ధి కోసం కృషి చేయాలనుకొనేవారు ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రజల ఆశీర్వాదాలకు అనుగుణంగా ప్రతి పదవిలోనూ తాను సేవ చేశానన్న సిద్ధరామయ్య ఇప్పటి వరకు 13 సార్లు ఎన్నికల్లో పోటీ చేశానని తెలిపారు. కర్నాటక అభివృద్ది లక్ష్యంగా తాను పని చేస్తున్నానని అన్నారు. తన దృష్టి ఇప్పుడు అదేనన్నారు.