వచ్చే వారం కరీంనగర్కు రాహుల్
-రైతు సందేశ్ యాత్రలో పాల్గొంటారు.
న్యూఢిల్లీ,ఏప్రిల్ 21 (జనంసాక్షి):
వచ్చే వారంలో తెలంగాణలో రాహుల్ రైతు సందేశయాత్ర కరీంనగర్ జిల్లా నుంచి ప్రారంభిస్తామని ఎంపీ వీహెచ్ చెప్పారు. రైతుల్లో ఆత్మస్థయిర్యం నింపేందుకే ఈ యాత్ర చేపడుతున్నామని ఆయన వివరించారు. రాహుల్ ప్రసంగంతో కార్యకర్తల్లో నూతనోత్తేజం కలిగిస్తామన్నారు. పదవి ఉన్నా, లేకపోయినా పార్టీకి సేవ చేస్తానన్నారు. తాను రాహుల్కు, కాంగ్రెస్పార్టీకి వీరవిధేయుడిగా ఉంటానని వీహెచ్ వివరించారు. భూసేకరణపై బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న మొడి వైఖరిని, దానివల్ల కలిగే నష్టాలను ప్రజలకు వివరిస్తామని అన్నారు. ఈ యాత్ర కోసం రాహుల్ను ఒప్పించామని అన్నారు. లోక్సభలో తమ నేత రాహుల్ ప్రస్తావించిన అంశాలపై జవాబివ్వలేని దిశలో ప్రభుత్వం ఉందన్నారు. ఈ ప్రభుత్వ హయాలంఓ రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. అందుకే తాము ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమం చేపట్టామని అన్నారు.