వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఓ అడుగు ముందుకు

13వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఓ అడుగు ముందుకు పడింది. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించేందుకు ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహా రెడ్డి నేతృత్వంలో ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు చేయనుంది. కొంతకాలంగా మాజీ సైనికుల నుంచి ఈ విషయంలో ఒత్తిడి పెరగటంతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది.