వరంగల్ నగరంలో రాజ్యలక్ష్మి హోమం

వరంగల్ ఈస్ట్, జూలై 02(జనం సాక్షి):
జులై 3 న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న  ప్రధాని నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ విజయవంతం కావాలని రామానుజకుటం  ఎల్లమ్మ బజార్ లో   వరంగల్ తూర్పు బిజెపి నాయకులు గంటా  రవికుమార్ ఆధ్వర్యంలో రాజ్యలక్ష్మి హోమంనిర్వహించారు. ఈ సందర్భంగా గంట రవికుమార్  మాట్లాడుతూ రాజ్యలక్మి అమ్మవారి ఆశీస్సులతో రాబోయే ఎన్నికల్లో తెలంగాణా లో అత్యధిక స్థానాల్లో గెలిచి బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు  శ్రీ కొండేటి శ్రీధర్  , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నం సతీష్ షా , జిల్లా ఉపాద్యాక్షులు కనుక్కుంట్ల రంజిత్ , పిట్టల కిరణ్ , రాష్ట ఎస్ సి మోర్చా నాయకులు మాదాసు రాజు , మార్టిన్ లూధర్ , జిల్లా సోషల్ మీడియా ఐటీ కన్వీనర్ ఆడెపు వెంకటేశ్  సీనియర్ నాయకులు పొట్టి శ్రీనివాస్ , పుప్పల రాజేందర్ , ముట్టినెని శ్రీనివాస్ , అంకాల జనార్ధన్ , చిలువెరు రాజేందర్,  రజక సెల్ కన్వీనర్ కొత్తపేల్లి రాజేష్ ఆర్ పి హెచ్ రాష్ట్ర అధ్యక్షులు మండల భూపాల్ గారు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ ఇనుముల అరుణ్ , ఓబీసి మోర్చా అధ్యక్షులు కూచన క్రాంతి , ఉపాద్యాక్షులు సతీష్ పోశాల ,  డివిజన్ అద్యక్షులు మోహన చారి , ఎల్లబోయిన చంద్ర మోహన్, ఇనుముల అజయ్, అకినే సాగర్, పుప్పాల శ్రీనివాస్ , మాచర్ల రవీందర్ , ఉపేందర్ , జిల్లా  నాయకులు, తూర్పు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు  పాల్గొన్నారు.