వర్షాని సైతం లెక్కచేయకుండా కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచారం

భువనగిరి జనం సాక్షి ఆర్.సీ న్యూస్ ;ఈరోజు భువనగిరి పట్టణ 23వ వార్డులో ఇందిరానగర్ లో భువనగిరి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గెలుపు కొరకు జోరు వానలో స్థానిక కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది.
ఈసందర్భంగా కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాట్లాడుతూ కుంభం అనిల్ కుమార్ రెడ్డి గత తొమ్మిది సంవత్సరాల నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ తాను అధికారంలో లేకపోయినా సరే తన సొంత డబ్బులతో పేద ప్రజలకు కష్టం వచ్చిందంటే నేనున్నానంటూ భరోసా కల్పించిన వ్యక్తి అనిల్ కుమార్ రెడ్డి, పేద ప్రజలు ఎవరైనా ప్రమాదంలలో గాయపడ్డ ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. అలాగే చదువుకునే పేద విద్యార్థులకు అండగా ఉండడం జరిగింది. కరోనా సమయంలో ఎంతోమందికి నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తూ మరియు కరోనా సోకిన వ్యక్తులకు ఆక్సిజన్ సిలిండర్ లు డ్రై ఫుడ్స్ హాస్పటల్ లో ఉన్నవాళ్లు కూడా ఆర్థికంగా తోడున్న మహోన్న వ్యక్తి శ్రీ కుంభం అనిల్ కుమార్ రెడ్డి, ఇలాంటి నాయకుని ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామంటే పేద ప్రజలకు నిత్యము అందుబాటులో ఉండి ప్రభుత్వపరంగా తన సొంతంగా అందరికీ తోడుగా ఉంటాడు. అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపడతాడని అన్నారు కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారి చెయ్యి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది ఈకార్యక్రమంలో గాయపాక స్వామి కారకాల పోచయ్య బర్రె యాదగిరి భూషపాక యాదగిరి తోట మహేందర్ కరకాల రమేష్ నువ్వుల రాజు పోకల నాగరాజు గోపే బాబు బర్రె నరేందర్ రాము మోహన్ మహేష్ సాయి మల్లేష్ ప్రభాకర్ ఈశ్వర్ ఓంకార్ కిరణ్ తరుణ్ బండారు శివ తోట వేణు మనోజ్ కుమార్ మల్లయ్య సుధాకర్ జమ్ములు భూపాల్ తదితరులు పాల్గొనడం జరిగింది.