*వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలి*

వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం.
న్యూస్ జనం సాక్షి.
 దోమ మండల ప్రజలకు విజ్ఞప్తి
గత మూడు నాలుగు రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అవసరం అయితేనే గాని బయటకు రాకూడదని దోమ మండల వైస్ ఎంపిపి గుర్మిట్కల్ మల్లేషం తెలిపారు . విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగి పోర్లే అవకాశాలున్నాయి . ఈత రానివారు నీటిప్రవాహాలకు దూరంగా వుండాలని, తల్లిదండ్రులు మీ పిల్లలను చెరువులు, కుంటలు లేదా వాగులవద్దకు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. అలాగే కరెంట్ స్తంభములకు దూరంగా ఉండాలని   వర్షాలు విజృంభిస్తున్న ఈ తరుణంలో మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.