వాటర్‌ ట్యాంకర్‌ను ఢీకొన్న ఖతార్‌ విమానం

కోల్‌కతా విమానాశ్రయంలో ఘటన

ప్రయాణికులకు తప్పిన ముప్పు

కోల్‌కతా,నవంబర్‌1(జ‌నంసాక్షి): ఖతార్‌ ఎయిర్‌వేస్‌కు చెందిన విమానం కోల్‌కతా విమానాశ్రయంలో ప్రమాదానికి గురైంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. దోహ – కోల్‌కతా మధ్య ప్రయాణించే 0152 విమానం కోల్‌కతాలోని సుభాష్‌ చంద్ర బోస్‌ విమానాశ్రయంలో నేలపైకి దిగుతుండగా ఓ మంచినీటి ట్యాంకర్‌ను ఢీకొంది. దీంతో విమానం మధ్యభాగం దెబ్బతింది. అధికారులు వెంటనే స్పందించి ఆ విమానాన్ని మరమ్మతుల నిమిత్తం తరలించారు. ఈ ఘటన నుంచి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.