వాట్సాప్లో హల్చల్ చేస్తున్న స్వాతి, రామ్కుమార్ల పర్సనల్ ఫోటో
చెన్నై: స్థానిక నుంగంబాక్కం రైల్వేస్టేషనలో హత్యకు గురైన స్వాతి, హంతకుడు రామ్కుమార్ జోడీగా ఉన్న ఫోటోలు ఫేస్బుక్, వాట్సాప్లో హలచల్ చేస్తున్నాయి. ఈ ఫోటోలు వారు తీసుకున్నవి కాదని ఎవరో వీటిని మార్ఫింగ్ చేసి పోస్ట్ చేశారని పరుశురామ్ అనే వ్యక్తి గురువారం మీడియాకు వివరించారు. సోషల్ మీడియాలో కనిపించిన ఫోటోలో ఉన్నది స్వాతి – రామ్కుమార్ కాదని, తన కుమారుడు ప్రదీప్, అతని స్నేహితురాలితో కలసి పుదుచ్చేరీలో తీయించుకున్న ఫోటోను సంఘ విద్రోహులు మార్ఫింగ్ చేసి ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే కుమార్తెను పోగొట్టుకున్న దుఃఖంలో ఉన్న ఆమె తల్లిదండ్రులకు ఇలాంటి చర్యలు మరింత బాధిస్తాయని, ఇటువంటి చర్యలు విడనాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.