విద్యార్థి ఆత్మహత్య సంచలనం

ముంబై స్టార్ హోటళ్లో ఓ కాలేజీ విద్యార్థి ఆత్మహత్య సంచలనం అయ్యింది. ఫేస్ బుక్ లో సూసైడ్ ట్యుటోరియల్ గురించి మాట్లాడుతూ.. లైవ్ లోనే హోటల్ భవనం నుంచి దూకేశాడు. ముంబైలోని తాజ్ లాండ్ స్టార్ హోటలో ఈ దుర్ఘటన జరిగింది. అతడు చనిపోయే ముందు ఫేస్ బుక్ లో ఒక నిమిషం 44 సెకన్ల వీడియో ఒకటి పోస్టు చేశాడని చెప్పారు పోలీస్ ఆఫీసర్ పండిత్ థాకరే. అందులో.. చనిపోవాలనుకుంటున్నారా అయితే చూడండి అని పోస్టు చేసి ఉందన్నారు. అతను బిల్డింగ్ పైనుంచి దూకే ముందు.. ఆత్మహత్య చేసుకోవడానికి ఐదు పద్దతుల గురించి వివరించాడు. తాగండి, తినండి, దూకేయండని పోస్టు ఉన్నట్టు వెల్లడించారు పోలీసులు. ఆ వీడియోలో నవ్వుతూనే తొమ్మిది అంతస్తుల హోటల్ భవనం నుంచి దూకేశాడు.

23 ఏళ్ల  అర్జున్ భరద్వాజ్ ది బెంగళూరు. ముంబైలోని నర్సీ మోంజీ కాలేజీలో బీకాం చదువుతున్నాడు. అంధేరిలోని ఒక అపార్ట్ మంట్ లో నివాసం ఉంటున్నాడు. ఏప్రిల్ 3న భాంద్రాలోని తాజ్ లాండ్ ఎండ్ స్టార్ హోటల్ కు సాయంత్రం 3 గంటల సమయంలో వచ్చాడు. మూడు గంటలు హోటల్ రూమ్ లోనే గడిపిన అనంతరం.. సాయంత్రం ఆరు గంటల 30 నిమిషాలకు హోటల్ భవనం నుంచి ఫేస్ బుక్ లైవ్ లో ఎలా సూసైడ్ చేసుకోవాలో పద్దతులను వివరిస్తూ అలాగే తొమ్మిదో అంతస్తు నుంచి దూకేశాడు.

అది గమనించిన హోటల్ సిబ్బంది భరద్వాజ్ ను హాస్పిటల్ కు తరలించారు. అప్పటికే చనిపోయినట్టు హాస్పిటల్ సిబ్బంది చెప్పారు. ఆత్మహత్యకు కారణాలపై క్లారిటీ రాలేదు. భరద్వాజ్ చదివే కాలేజీ యాజమాన్యం, ఫ్రెండ్స్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. పేరంట్స్ కు సమాచారం ఇచ్చారు.